Showing posts with label గోగులపాటి కృష్ణమోహన్. Show all posts
Showing posts with label గోగులపాటి కృష్ణమోహన్. Show all posts

Thursday, November 26, 2020

నోటుకే మా ఓటు - గోగులపాటి కృష్ణమోహన్

 నోటుకే మా ఓటు
రచన : గోగులపాటి కృష్ణమోహన్

నోటుకే మా ఓటు

ఎం మామ ఎం ఆలోచిస్తున్నావు.... అని అడిగాడు అనిల్ తన మిత్రుడు అఖిల్ ను... ఆ ఎం లేదు మామ... గ్రేటర్ ఎన్నికలు వస్తున్నాయి కదా ఎవరికీ ఓటు వేద్దామా అని ఆలోచిస్తున్నాను... అని సమాధానం చెప్పాడు అఖిల్. ఇందులో ఆలోచించడానికి ఏముంది మామ.. నోటిచ్చిన వాడికే ఓటేస్తే సరి... మా తాతల కాలం నుండి ఇదే ఆచరిస్తూ వస్తున్నారు అని సమాధానం ఇచ్చాడు అఖిల్, దీంతో ఒక్కసారిగా కంగారు పడ్డ అనిల్ అదేంటి మామ ఆలా అన్నావు అని అనేసరికి.. మరేంటి మామ ప్రస్తుతం పరిస్థితి అలాగే ఉంది. చేసిన వాగ్దానాలతో సంబంధం లేదు, చేయని అభివృద్ధి తో సంబంధం లేదు, స్థానిక, సంస్థాగత ఎన్నికలకు సైతం స్థానిక అభ్యర్థితో సంబంధం లేకుండా ప్రాంతీయ, జాతీయ స్థాయి పార్టీలే ప్రధాన భూమిక పోషిస్తున్నాయి మామ.

పోనీ ఆ పార్టీలైన సరైన అభ్యర్థిని నిలబెడుతాయా అంటే ఆదీలేదు... పేరుకు మాత్రమే రిజర్వేషన్లు మామ, అభ్యర్థులు మాత్రం ప్రధాన నాయకుల అనుచరులకో... అర్దాంగికో... ఇస్తూ... పెత్తనం మాత్రం వారి చేతిలోనే ఉంచుకుంటున్నారు.   ఇదీ దుస్థితి మామ... అందుకే నా ఓటు నోటుకే వేద్దామనుకుంటున్న... అని ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చాడు అఖిల్.

నిజమే అఖిల్ నువ్వు చెప్పినట్టు మా ఏరియాలో మహిళా రిజర్వేషన్ ఉంటేనూ స్థానిక మహిళా విభాగం అధ్యక్షురాలికి లేదా సీనియర్ మహిళా నాయకురాలికి టికెట్ ఇస్తారని అనుకున్న... కానీ ఆలా చేయకుండా మాజీ నాయకుని భార్యకే టికెట్ ఇచ్చారు... తనకే ఏమి తెలియదు... ఆరోగ్యం కూడా సరిగా లేదు... పాపం పడుతూ లేస్తూ ప్రచారం చేస్తుంది అని వాపోయాడు అనిల్.

కానీ నువ్వన్నట్టు నోటుకే ఓటు వేద్దామా అని అనుమానం వ్యక్త పరిచాడు అనిల్. అప్పుడు అఖిల్ స్పందిస్తూ... మరేం చేయమంటావు మామ... వద్దన్నా ఇంటింటికి తిరుగుతూ ఓటర్లు డబ్బులకు అమ్ముడుపోతున్నట్టు బేరసారాలకు దిగుతున్నారు. డబ్బులు వద్దంటే నిష్ఠూరంగా… అయితే మాకు ఓటు వేయవన్న మాట అంటూ వారికీ వారే ఊహాగానాలు, నిందారోపణలు చేస్తున్నారు. పోనీ తీసుకుందామా అంటే మనసు అంగీకరించడం లేదు అందుకే నీకు ఆ సమాధానం చెప్పా అన్నాడు అఖిల్.

నిజమే అఖిల్, నువ్వన్నట్టు స్థానిక ఎన్నికలకు కూడా కోట్లలో ఖర్చు పెడుతున్నారు, కనీసం స్థానిక సమస్యల పట్ల అవగాహనలేని వారిని నిలుచోబెడుతున్నారు. ఇక వారు ఎం మాట్లాడుతారు, ఎం పనులు చేసి పెడుతారు. ఏంటో ఆలోచిస్తే అంతా అయోమయం గందరగోళంగా ఉంది అంటూ ఆందోళన వ్యక్తం చేసాడు అనిల్.  

సరేగానీ ఇంతకూ నీ ఓటు ఎవరికో చెప్పలేదు... అని అడిగాడు అఖిల్ అనిల్ ను... ఇంకెవరికి నోటుకే అంటూ నవ్వుతూ సమాధానం చెప్పాడు అనిల్. ఇద్దరూ కాసేపు నవ్వుకొని... నా ఓటు మాత్రం పార్టీ కి కాకుండా పర్సన్ ను చూసి ఏద్దామనుకుంటున్న... వ్యవస్థ మార్పు కోసం సరైన వ్యక్తిని ఎంచుకొని ఓటేస్తా  అని అఖిల్ అనగానే... నేను అదేపని చేస్తా... వాళ్ళు ఇంత ఖర్చు చేస్తున్నారంటే ఎంత సంపాదిస్తారో అర్ధం చేసుకోవాలి. అందుకే ఖర్చు చేయని, మనకు అందుబాటులో ఉండే నాయకునికి నా ఓటు అని అనిల్ తన అభిప్రాయం చెప్పగానే... ఇంతలో అక్కడికి ఓ పార్టీ గ్యాంగ్ రాణే వచ్చింది. 

ఏరా ఎవరికీ వేస్తున్నారు మీ ఓటు అని అడగనే అడిగారు. వీరు సమాధానం చెప్పేలోపే... సరేగానీ మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయో చెబితే డబ్బులు పంపిస్తాం.. ఓటుమాత్రం మా నోటుకే అదే మా గుర్తుకే వేయండి సరేనా అంటూ చేబుతూ వెళ్లిపోయారు... 

అఖిల్, అనిల్ ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటూ ఇంటికి బయలుదేరారు...

రచన : గోగులపాటి కృష్ణమోహన్ 

సూరారం కాలనీ, హైదరాబాద్,

9700007653

 



Thursday, April 9, 2020

రాజుకు నలుగురు 18వ బాగం


రాజుకు నలుగురు 18వ బాగం
రచన: గోగులపాటి కృష్ణమోహన్

అప్పుడు నారదుడు ఆ దేవేంద్రుడిని పక్కకు తీసుకెళ్ళి... ఓ దానవేంద్రా... నీవు ఇంకేమీ ఆలోచించకు... ఇది నీ పూర్వ జన్మ శాప ఫలమే తప్ప మరొకటి కాదు. ఆ శాప ఫలమే నీవు ఈ మానవున్ని అల్లుడిగా స్వీకరించి కాళ్ళు కడిగి కన్యాదానం చేయవలసి వస్తుంది.. ఇది దైవేచ్చే తప్ప మరొకటి కాదు. అంటూ పూర్వజన్మ వృత్తాంతం తెలియజేస్తాడు నారదుడు.
అప్పుడు తేరుకున్న దేవేంద్రుడు ఆ మానవున్ని తన అల్లుడిగా ప్రకటిస్తూ... తన కూతురితో పాటు... నాగకన్య, జలకన్య, అగ్ని కన్యలను ఇచ్చి ఘనంగా వివాహం జరిపించి భులోకానికి పంపిస్తారు.
భూ లోకానికి చేరుకున్న యువరాజుకు రాజ్య ప్రజలంతా ఘన స్వాగతం పలుకుతారు.  ఆ దేశ రాజు కూడా అస్వస్థతకు గురై తన రాజ్యానికి యువరాజుకే పట్టాభిషేకం చేస్తాడు...
యువరాజు చుట్టు ప్రక్కల రాజ్యాలన్నీ వీరోచితంగా పోరాడుతూ తన వశం చేసుకుంటాడు తన సోదరులను ఒక్కో రాజ్యానికి రాజులను చేసి రాజ్యాలను అప్పగిస్తాడు.
తన పరిపాలనలో రాజ్యంలోని ప్రజలందరూ ఎంతో సుఖంగా జీవిస్తూ ఉంటుంటారు.
ఒకరోజు నిండు పౌర్ణమి రోజున రాజు తల్లితండ్రులు మేడపైకి వెళ్ళి చూడగా... మల్లెపందిరి కింద పట్టెమంచం మీద తన చిన్న కొడుకు పడుకొని ఉండగా... నాలుగు దిక్కులు నలుగురు దేవకన్యలు తన కుమారునికి సపర్యలు చేస్తుండగా చూసిన ఆ రాజుకు ఆ రోజు కుమారుడు చెప్పిన మాటలు గుర్తొస్తాయి.... అవి "తండ్రీ..... పట్టె మంచంపై పడుకొని... నాలుగు ప్రక్కల నలుగురు సురకన్యలు నించుని చామరాలతో వీస్తుండగా.... హాయిగా నిద్రించాలని ఉంది ప్రభూ అని"...
వెంటనే తన భార్యతో... దేవీ చూడు నీ గారాల కుమారుడు... అన్నమాట నిలబెట్టుకున్నాడు అంటూ ఎంతో సంతోషిస్తాడు ఆ రాజు తన నలుగురు కుమారులతో... ఆ యువ రాజు తన నలుగురు భార్యలతో...
ఇదే ఆ రాజుకు నలుగురు..
సమాప్తం
ఈ కథ నా చిన్నవయసులో మా నానమ్మ కీll శేll రాలు గోగులపాటి నర్సుబాయమ్మ గారు నాకు చిన్నతనంలో చెప్పిన కథను అక్షరీకరించి మీకు అందించాను... అయితే దీనిని చదివిన కొందరు పాఠకులు (ప్రతిలిపి లో మరియు వాట్సప్ లలో) ఇది జగదేకవీరుని కథ (పాతది) పోలి వుందని తెలియజేశారు. అప్పుడు నేను ఆ సినిమా చూసాక తెలిసింది దాదాపుగా అలాగే ఉంది. (క్లైమాక్స్ తప్ప). కానీ ఇది నేను విన్న కథ ఆధారంగా మాత్రమే రాయడం జరిగింది అని తెలియజేస్తున్నాను.
కథను నిత్యం చదివి ప్రోత్సహించిన పాఠకులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఙతాభివందనాలు తెలియజేసుకుంటూ...
రచయిత
మీ
గోగులపాటి కృష్ణమోహన్
కవి, రచయిత, జర్నలిస్టు
సూరారంకాలని, హైదరాబాదు.
9700007653


శుభం

రాజుకు నలుగురు 17వ బాగం

రాజుకు నలుగురు 17వ బాగం
రచన: గోగులపాటి కృష్ణమోహన్

మానవా.. ఇదుగో ఈ మహావృక్షం కొన్నేళ్ళ సంవత్సరాల క్రితంది.

ఈ మహా వృక్షాన్ని ఒక్కే ఒక్క గొడ్డలి పెట్టుతో కొట్టి కూల్చిచేయాలి అని పరీక్ష తెలియజేస్తాడు నారదుడు. అంతే కాదు నీవు ఇందుకోసం ఎవరిసహాయం కోరరాదు అని చెప్పి సేవకులారా... ఆయుధాలు తీసుకోనిరండి అని చెప్పగానే... దానికి సంబందించిన పలు విధాల గొడ్డల్లను తీసుకొచ్చి మానవుని ముందుంచుతారు... మానవా నీకు నచ్చిన ఆయుధాన్ని తీసుకోని మీరు పరీక్షలో పాల్గొనవచ్చు అని చెప్పగానే.. తాను తనకు నచ్చిన గొడ్డలి తీసుకోని ఆ మహా వృక్షం వద్దకు వెళ్తాడు...

ఏంటి ఈ రెండు పరీక్షలంటే వాటి సహాయం తీసుకున్నాను... ఈసారి ఎవరి సహాయం తీసుకోకుండా చేయమన్నారు... దీనికి బుద్దిబలం సరిపోదు, దేహబలం కూడా సరిపోదు... మరెలా? అని ఆలోచిస్తూ... తన ఇష్ట దైవాన్ని ప్రార్ధిస్తాడు...

ఇక గొడ్డలి తీసుకొని పైకెత్తి.... దైవాన్ని తలుచుకుంటూ... గట్టిగా ఒక దెబ్బ వేస్తాడు.

అంతే అంతటి మహా వృక్షం పెలపెల మంటూ కిందికి విరుచుకు పడుతుంది... అందరూ ఆశ్చర్యానికి లోనవుతారు... అదేమని అందరూ ఆ వృక్షం వద్దకు చేరుకుంటారు... ఎవ్వరికీ ఏమీ అర్ధం కాదు... చివరికి యువరాజుకు కూడా...

అక్కడే ఉన్న నారదుడు భళా మానవా భళా... నీవు చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుక్కున్న తుమ్మెదలు నీ ఆపదను కనిపెడుతూనే ఉన్నాయి... ఈ పరీక్ష వాటికి తెలువగానే అవి ఆ మహా వృక్షాన్ని మొత్తం లోనికెళ్ళి వలిచిపెట్టాయు... నీవు అడగకున్నా వాటి ధర్మం అవి చేసాయి. నీకు తెలిసో తెలియకో నీవు అడగకున్నా మూగ ప్రాణాలకు చేసిన ప్రాణబిక్షే నిన్ను ఈనాడు కాపాడాయు. అంతే కాదు. అవి నీకు ఏవిధంగా సహాయపడగలవు అని నీ మనసులో కూడా నీవు అనుకున్నావు... చూసావు కదా ఎప్పుడు ఏ ప్రాణి ఏవిధంగా సహాయం పడుతుందో తెలిసిందికదా... అని చెబుతాడు.

అందుకు ఆ యువరాజు ఆ తుమ్మెదలకు మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంటూ... నారదునికి నమస్కరిస్తాడు...

మానవా మేము పెట్టిన అన్ని పరీక్షలలో నీవు నెగ్గావు... ఇక దేవేంద్రుడి నిర్ణయమే తదుపరి అని నారదుడు చెప్పినా... దేవేంద్రుని మనసు ఎందుకో అంగీకరించడం లేదు.

ఇంకా ఉంది 18వ బాగం

రాజుకు నలుగురు 16వ బాగం

రాజుకు నలుగురు 16వ బాగం
రచన: గోగులపాటి కృష్ణమోహన్

ఎలా అని అలోచిస్తుండగా... అతని కాలుకు చీమ వచ్చి కుడుతుంది. వెంటనే అబ్బా అని చూడగా కాలుకింద చీమ... దానిని చూడగానే అది ఏం యువరాజా... ఆపదకాలంలో మాకు సహాయం చేసావు మరచిపోయావా? లేక ఈ చీమలు నాకేం సహాయపడుతాయని సందేహమా? అని అడగానే... ఆ యువరాజు ఎంతో సంతొషపడి... ఓ చీమలారా... మీరు నాకు ఈ సహాయం చేసిపెడితే నా జన్మంతా ఋణపడి ఉంటాను అని ప్రాధేయపడుతాడు.

తప్పకుండా అని ఆ చీమలు హామీ ఇచ్చి వాటి పనిలో అవి నిమగ్నమవుతాయి...

ఇంకేం నారదుడు పరీక్ష ప్రారంభించడమే ఆలస్యం ఇసుక కుప్ప చూస్తుండగా కదిలిపోతుంటుంది... లెక్కకు మించిన చీమలు ఇచ్చిన సమయానికి ముందే దేనికది వేరు చేసి పెడుతాయి.

వెంటనే యువరాజువా చీమలకు ప్రణమిల్లి కృతజ్ఞతలు తెలియజేస్తాడు.

అది చూస్తూ నిశ్శేష్టులైన దేవేంద్రుడు... అంతా మోసం ఇది మానవుడు స్వయంశక్తితోనో... మేధాశక్తితోనో చేసింది కాదు... అని ఆక్షేపణ చెప్పగానే... నారదుడు ఇలా అంటాడు...

ఓ దేవేంద్ర... మీ పరీక్లలో ఎక్కడా ఆ మానవుడు స్వయంగా చేయాలి అని చెప్పలేదు కదా అని అనగానే...

అప్పుడు దేవేంద్రుడు సరే... ఈ సారి మానవుడే స్వయంగా చేసే పరీక్ష పెడ్టండి అంటాడు.

అప్పుడు నారదుడు తీవ్రంగా ఆలోచించి సరే అంటాడు.

మానవా ఈ సారి పరీక్షలో నీవే ప్రత్యక్షంగా పాల్గొని గెలిస్తేనే దేవకన్యలు నీ వశం అవుతారు లేదంటే దేవేంద్రుడి శిక్షను అనుభవించాల్సి ఉంటుంది అని చెప్పి..

మానవా ఇప్పటివరకు నీవు గతంలో చెసిన సహాయసహకారాలు నీకు ఈ విందంగా మెలు చేసిపెట్టాయి, ఇక నీకా అవకాశం లేదు ఎందుకంటే ఈసారి నీవే ప్రత్యక్షంగా పాల్గొనాల్సి ఉంటుంది కావట్టి నీవు ఇప్పటికైనా తప్పుకోని నీ భూలోకం వెళ్లి హాయిగా నీకు నచ్చిన మానవ కన్య ను చేసుకోని హాయిగా బ్రతుకుము. అందుకు నీకేం కావాలో దేవేంద్రుడితో అడిగి ఇప్పిస్తా... లేదంటే నీ ప్రాణాలకే అపాయం సుమా! అని సలహా ఇస్తాడు.

అందుకు ఆ యువరాజు మాట్లాడుతూ... మునీంద్రా... ప్రేమ సాక్షిగా వివాహం చేసుకున్న నా భార్యలను ఇక్కడ విడిచి పెట్టి వెళ్తే నా యీ జన్మకు ఫలితం ఏముంటుంది? నా భార్యలు లేని ఈ ప్రాణం తృణప్రాయం. అప్పుడు అది ఉన్నా ఒకటే... లేకున్నా ఒకటే...

ఏది ఏమైనా ఈ పోటీలో పాల్గొంటా... విజయం సాధిస్తా... నా భార్యలను తీసుకోని వెళ్తా అని గట్టిగా సమాధానం ఇస్తాడు యువరాజు.

అప్పుడు నారదుడు నారాయణ నారాయణ అంటూ సరే మానవా... నీ యిష్టం ఇక నీకు మూడవ పరీక్ష... ఈ పరీక్షలో నీవే ప్రత్యక్షంగా పాల్గొని గెలవాల్సి ఉందని పరీక్ష ఏంటో చెబుతాడు ఇలా చెబుతాడు నారదుడు.

ఇంకా ఉంది 17వ బాగం

రాజుకు నలుగురు 15వ బాగం

రాజుకు నలుగురు 15వ బాగం
రచన: గోగులపాటి కృష్ణమోహన్

ఇలా అలోచిస్తుండగానే భటుడు ఉమ్మివేయనే వేసాడు..

ఇంతలో మానవుడికి ఒక ఆలోచన వస్తుంది... తనకు ఎలాంటి సహాయం అవసరమైనా చేస్తామని ఆరోజు మండూకాలు (కప్పలు) చెప్పిన మాటలు గుర్తొచ్చి వెంటనే... వాటిని ప్రార్ధిస్తాడు... ఓ మండూకాల్లారా... ఆనాడు మీనుండి ఎలాంటి సహాయం ఆశించి మిమ్మల్ని కాపాడలేదు. కానీ ఈనాడు నేను ఒక మిత్రునిగా మీ సహాయం కోరుతున్నాను... నా ప్రేమే నిజమైతే... ఈ కొలనులోని అంగుళీకాన్ని నాకు త్వరితగతిన తెచ్చివ్వగలరు అని ప్రాధేయపడుతాడు.

తలచినదే తడవుగా... అంగుళీకానితో ఒడ్డుకొస్తుంది మండూక రాజు...

ఓ యువరాజా... నీకు మేము సహాయ పడినందుకు మా జన్మ ధన్యమయ్యింది మిత్రమా... నీ ఋణం ఇలా తీర్చుకోవడానికి మాకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ వెల్లిపోతాయి.

వాటి సహాయానికి ఎంతో సంతోషిస్తూ... మనసులోనే ఆ మండూకానికి కృతజ్ఙతలు తెలియజేసుకుంటూ...ఆ అంగుళీకాన్ని సభకు అందజేస్తాడు మానవుడు.

ఈ హటత్ పరిణామానికి అందరూ ఆశ్చర్యచకితులవుతారు. దేవేంద్రుడు మాత్రం ఆగ్రహానికి గురౌతాడు.

నారదా... ఇది అన్యాయం... ఇందులో ఈ నరుడి గొప్పతనం ఏముంది. మేము అంగీకరించము అనగానే... అందుకు నారదుడు... నారాయణ నారాయణ... దేవేంద్రా... మీరేమన్నారు... మొసళ్ళను చంపకుండా... నీటిన తడవకుండా తేవాలని కదా... మరి అదెలా సాధ్యం... ఇలా అసాధ్యమైన పరీక్ష సుసాధ్యం చేయడం అనేది సాధారణ విషయం కాదు... ఈ మానవుడు ఈ పరీక్షలో నెగ్గాడు... ఇది నా నిర్ణయం అని దేవేంద్రుడికి నచ్చచెప్పి... తదుపరి పరీక్షకు సిద్దమవ్వమని మానవునికి చెబుతాడు.

అందుకు ఆ మానవుడు సంసిద్ధత వ్యక్తపరుస్తాడు...

సరే నీ రెండో పరీక...

ఎవరక్కడ...

పుట్టడు తిలాలు (నువ్వులు) తీసుకోని రండి అని ఆజ్ఙాపించగానే సేవకులు తిలాలు తీసుకొస్తారు.

అలాగే వీటికి రెట్టింపు ఇసుకను తెచ్చివ్వండి...

అనగానే అవీ తెచ్చిస్తారు సేవకులు...

అవి రెండిటినీ కలపండి అని చెప్పగానే ఆ ఇసుకలో నువ్వులు కలిపేస్తారు..

మానవా... ఇక నీ పని... నీకు అర ఝాము (గంటన్నర / 3.5 ఘడియలు) సమయం కేటాయిస్తున్నాము... ఈలోగా ఈ తిలాలను ఆ ఇసుక నుండి వేరు చేయాలి అనగానే...

ఆ మానవుడు ఇదెక్కడి పరీక్ష అనుకుంటూ ఎలా అని ఆలోచనలో పడుతాడు.

ఇంకాఉంది 16వ బాగం

రాజుకు నలుగురు 14వ భాగం

రాజుకు నలుగురు 14వ భాగం
రచన : గోగులపాటి కృష్ణమోహన్

అందరూ ఆసక్తిగా చూస్తుంటారు... మరోసారి మహేంద్రుడు ఆ మానవున్ని సభాముఖంగా... సర్వదేవుళ్ళ సాక్షిగా ప్రమాణం చేయమంటారు... ఆ యువరాజు అందరిమీదా చేస్తాడు... అయినా నమ్మకం కలగని ఆ దేవేంద్రుడు భూలోకవాసులకు మాతాపితలన్న మహా భక్తి.. మీ తలిదండ్రులమీద ప్రమాణము చేయమనగానే అదీ చేస్తాడు యువరాజు.

ఇక చేసేదేమీ లేక నారదా... ఈ సమావేశాన్ని మీ సారధ్యంలో నిర్వహించండి అని భాధ్యతలను నారదునికి అప్పగిస్తాడు దేవేంద్రుడు.

నారాయణ నారాయణ.... ధన్యోస్మి ధన్యోస్మి దేవేంద్రా... తప్పకుండా మీ ఆజ్ఙ శిరసావహిస్తాను కానీ... నా తుది నిర్ణయాన్ని మాత్రం అందరూ ఆమోదిస్తా అంటేనే నేను ఈ బాధ్యత చేపడుతాను అనగానే దేవేంద్రుడు సరే మాకునూ ఆమోదమే అని తెలుపుతాడు.

మానవా... ఇక మొదలెడుదామా అని అనగానే నేను సిద్ధము మునీంద్రా అని ఆ యువకుడు తెలుపుతాడు.

సరే ఇక కాచుకో... నీకు మూడు పరీక్షలు నిర్వహిస్తాము... ఇందులో అన్ని పరీక్షలు నెగ్గాల్సి ఉంటుంది. ఇదా, అదా, కూడదు, నావలన కాదు లాంటి సమాధానాకు నీ ఓటమి సూచించేవిగా గుర్తుంచుకో గలరు అని సెలవిస్తారు నారదుడు.

సరే మునీంద్రా నా ప్రేమే నిజమైతే మీరు పెట్టే అన్ని పరీక్షలు నెగ్గి నా దేవకన్యలతో నా భూలోకమేగుతాను... లేదంటే ఇక్కడే నా ప్రాణమొదులుతాను అని చెప్పగానే చాటుమాటుగా ఉండి ఇదంతా కనిపెడుతున్న దేవకన్యల మనస్సు చివుక్కు మంటుంది.

ఇంతగా ప్రేమించే భూలోక వాసిని మనం కాదనుకున్నాము కదా అని లోలోన బాధపడుతుంటారు.

నారాయణ నారాయణ... నీకు మొదటి పరీక్ష...

మానవా... ఇదిగో అంగుళీకము... దీనిని ఈ మొసళ్ళు ఉన్న కొలనులో వేస్తాను... మా బటుడు ఉమ్మివేసిన ఉమ్మి తడి ఆరే లోగా నీవు తడవకుండా, మొసళ్ళను చంపకుండా ఆ అంగుళీకాన్ని మాకు అందించాలి అనగానే మానవుడు ఆలోచనలో పడుతాడు.

అంగుళీకము తీయడము సులువే... కానీ...
మొసళ్ళను చంపకుండా... అదీ తడవకుండా... ఇదెలా సాధ్యము అని ధీర్ఘాలోచనలో పడుతాడు మానవుడు.

ఇంకా ఉంది 15వ బాగము


రాజుకు నలుగురు 13వ భాగం

రాజుకు నలుగురు 13వ బాగం
రచన : గోగులపాటి కృష్ణమోహన్

దేవేంద్రా... మీరు ఔనన్నా... కాదన్నా... ఆ నరుడు మీ అల్లుడు కాక మానడు. మీరు మామలు అవ్వక మానరు.

ఇప్పుడు మీ కింకర్తవ్యం ఒక్కటే... అతడిని అల్లుడిగా అంగీకరించడం తప్ప మరొక మార్గం లేదు.

ఇలా అనగానే దేవేంద్రుడు ఆగ్రహానికి గురయ్యాడు... చాలు నారదా చాలు.. ఇందుకా నిన్ను పిలిచింది... భలే సలహా ఇచ్చావయ్యా... సరే సరే... మీరు ఇక బయలుదేరండి లేదా ఏదైనా మంచి ఉపాయమైనా సెలవివ్వండి అని అనగానే... అప్పుడు నారదుడు తీక్షణంగా ఆలోచించి... నారాయణ నారాయణ... ఒక ఉపాయం చెబుతాను వినండి అని... ఈ విధంగా చెబుతాడు...

దవేంద్రా... మీరు వదిలిచ్చుకుందామన్నా ఆ నరుడు మిమ్మల్ని వదిలిచ్చుకునేలా లేడు. కావున అతడిని మీరు అల్లుడుగా ఆమోదించాలంటే కొన్ని పరీక్షలు పెట్టండి. అందులో అతడు నెగ్గితేనే మీ కూతుర్లను ఇచ్చి వివాహం చేసిపంపుతామని చెప్పండి అని చెప్పగానే... ఇదేదో బాగుందే... కానీ ఆ నరుడు అవికూడా సాధిస్తే ఏంటి అని సందేహం వ్యక్తం చేస్తాడు దేవేంద్రుడు.

అప్పుడు నారదుడు మామవ మాత్రుడు చేయలేని పరీక్షలే పెడుదాం అని చెప్పగానే... అందరూ సరే అని ఆ ప్రశ్నలేంటో నారదున్నే అడిగి తెలుసుకొని వెళ్తారు.

ఒకరోజు దేవలోకం లో సమావేశం ఏర్పాటు చేసి నరున్ని ప్రవేశపెట్టండి అంటూ దూతలకు సమాచారం ఆదేశించగానే దూతలు ఆ మానవున్ని సభలో హాజరు పరుస్తారు.

ఓ మానవా నిన్ను మా అల్లునిగా స్వీకరించాలంటే నీవు మా పరీక్షలను నెగ్గాలి. లేదంటే నీవు సామాన్యుడిగా నీ లోకం వెళ్ళిపోవాలి అని చెప్పగానే ఆ మానవుడు సరే అని పరీక్షకు సిద్దమవుతాడు.

 సరే ఇది నీ మొదటి పరీక్ష...

ఇంకా ఉంది 14వ భాగం

మీ
గోగులపాటి కృష్ణమోహన్

రాజుకు నలుగురు 12వ భాగం

రాజుకు నలుగురు 12 వ బాగం
రచన : గోగులపాటి కృష్ణమోహన్

దేవేంద్రా... ఇప్పుడేమి మన తక్షణ కర్తవ్యం?

అందుకు దేవేంద్రుడు ఆవేశంగా... ఆ నరుడు మనకు అల్లుడు అవడమేమి? నాకంటే తెలియక జరిగింది. మరి తెలిసి మీరెందుకు ఇచ్చినట్టు? మీ బుద్ది ఏమయ్యింది అని ఆవేశంతో ప్రశ్నిస్తాడు.

అప్పుడు ఆ వరుణ దేవుడు, అగ్ని దేవుడు, నాగరాజులు ఒకే సమాదానము చెబుతారు.

ఆర్యా! మీ కూతురు మాకు ప్రత్యేక ఉత్తరము వ్రాస్తేనే మా కూతురును ఇచ్చి చేయడం జరిగింది. మీకు తెలుసుకదా... చిన్ననాటి నుండి వారు నలుగురు ఎంతగా కలిసి మెలిసి తిరిగేవారో... ఇప్పుడు భర్తను కూడా అలాగే కలిసి పంచుకుంటున్నారు.

అది వినగానే దేవేంద్రుడు మండి పడ్డాడు. ఇప్పుడు ఆ నరుడిని ఇక్కడినుండి ఇక్కడే యమలోకం పంపిచ్చేద్దాం పదండి అనగానే... యముడు ప్రత్యక్షం అవుతాడు... దేవేంద్రా ప్రణామములు... ఏమియా ఆవేశము... ఎందులకా నిర్ణయము... ఏ నేరము చేశాడని ఆ నరున్ని నేను యమపురికి గైకొని పోవలె అని ప్రశ్నిస్తాడు.

అదేమి యమా... నీవు తలుచుకుంటే అదెంతపని అని అనగానే... అందుకు యముడు దేవేంద్రా... నేను దర్మపరాయణుడను... బ్రహ్మ రాసిన తలరాతకు విరుద్దంగా నేనేమీ చేయలేను, మన్నించండి, సెలవు అంటూ అక్కడినుండి నిష్కమిస్తాడు యముడు.

ఇక ఏమి చేయాలా అని అనుకుంటున్న తరుణంలో...
నారాయణ నారాయణ... అందరికీ వందనం... ఏంటో ఈ రహస్య సమావేశం... అంటూ నారదుడు ప్రవేశించగానే... అందరికి గుండె ఆగినంత పనౌతుంది.

ఎవరివరకు ఈ విషయం వెళ్ళవద్దు అనుకున్నామో... ఆయనే రావడంతో ఇక తమ పరువు పోయినట్టే అని, ఎలాగైనా ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా ఉండేందుకు అందరూ నారదున్ని వేడుకుంటారు.

నారదా ఎలాంటి విపత్కర పరిస్థితులలో అయినా నీవే చక్కటి సలహాలు సూచనలు ఇచ్చేవాడవు. ఇప్పుడూ మీరే ఎలాగోలా వాడిని హతమార్చే సలహా ఇవ్వండి. అనగానే... నారదుడు అడుగుతాడు...

ఇంతకీ ఆ నరుడు చేసిన నేరమేమి అనగానే... ఆ నరుడు దొంగచాటుగా దేవలోకం చేరుకొని మా కన్యలను కావాలని కోరుతున్నాడు అని చెప్పగానే... నారదుడు ఆశ్చర్యంగా... ఏమి దేవేంద్ర మీ కూతుళ్లు కన్యలా.... నారాయణ నారాయణ ఎంతమాట? ఎంతమాట...? ఇన్నాళ్ళూ కాపురం చేసివచ్చిన వారు కన్యలేమి దేవేంద్రా? అయినా ఆ మానవుడు మీ దేవలోకం వస్తే తప్పు... అనర్హుడు?  కానీ అదే మానవుడితో ఇన్ని రోజులు కాపురం చేసి వచ్చిన మీ కూతుళ్ళు మాత్రం దేవలోకానికి వస్తే అర్హులా? ఇదేమి న్యాయం దేవేంద్రా అని అడగగానే అందరూ ఆలోచనలో పడుతారు.

సరే నారదా... ఇప్పుడు మనమేం చేయాలి.. కింకర్తవ్యం సెలవిండు అని దేవేంద్రడు నారదున్ని సలహా అడుగుతాడు.

అప్పుడు నారదుడు ఇలా సలహా ఇస్తాడు.

ఇంకా ఉంది 13వ బాగం

Tuesday, June 6, 2017

రాజుకు నలుగురు.... 11వ బాగం



రాజుకు నలుగురు 11వ బాగం

ఆరథం దేవలోకం చేరగానే.... దేవేంద్రుడు ఒక్కసారిగా.... నరవాసన.... నరవాసన... అంటూ.... అరుస్తుంటాడు..... దేవబటులంతా తిరుగుతూ.... రథం కిందదాచుకున్న రాకుమారున్ని బందించి దేవేంద్రుని ముందు ప్రవేశ పెడతారు....

దేవదేవా.... ఇదుగో మానవ మాత్రుడు.... దొంగచాటుగా దెవకన్య రథంలో దాచుకొని వచ్చాడు అని దేవేంద్రుని ముందు హాజరు పరుస్తారు.

అప్పుడు దేవేంద్రుడు ఓరీ తుచ్చమానవుడా.... ఎంత ధైర్యంరా నీకు.... మా అనుమతి లేకుండా నా లోకప్రవేశం చేస్తావా.... ఇంతకీ ఎవరునీవు.... నీకు మరణశిక్ష విధిస్తున్నాము అని బెదిరించగానే....

రాకుమారుడు శాంతంగా.... వెటకారంగా... మామా దేవేంద్ర.... నన్నే మరిచితివా... అకటకటా.... ఎంతమాట... ఎంతమాట.... మాకు మరణశిక్ష విధించుటయా... మరెందుకు ఆలస్యం ..... మరణశిక్ష విధించండి అంటాడు.

అలాగైతే నాతోపాటు.... ఇన్నాళ్ళూ ఈ మానవ మాత్రునితో ఎన్నో రాత్రులు గడిపిందే నీ గారాల కూతురు.... దానినీ ఉరితీయండి.... మేం కలిసి బ్రతకలేకపోయినా.... కనీసం కలిసైనా చస్తాం అంటాడు.

అందుకు దేవేంద్రుడు నెవ్వరపోయి... వీడేంటి... మామా యనుట ఏంటి? అని అనుకుంటూ అసలు విషయం తెలుసుకుంటాడు.

ఇక ఏంచేయాలో తోచక తన మంత్రివర్గ సమావేశం ఏర్పాటుచేసి ఏ నిర్ణయం తీసుకోవాలో ఆలోచించాడు....

వీరితోపాటు నాగరాజు, మృగరాజు, అగ్నిదేవున్ని కూడా ఆహ్వానించి జరగవలసిన విషయాన్ని చర్చించి ఒక నిర్ణయానికి వస్తారు....

ఇంకాఉంది... 12వ బాగం

రాజుకు నలుగురు .... 10వ బాగం


రాజుకు నలుగురు .... 10

కుమారా! నీవు యుద్దానికి బయలుదేరేముందు నాకు నీవిచ్చిన దేవతా వస్త్రాన్ని నీవు చెప్పినట్టుగానే నా తొడలో మంత్ర శక్తితో బద్రపరిచాను.

నీవు యుద్దానికి వెళ్ళినాక కోడళ్ళందరూ కలిసి నావద్దకు వచ్చి నన్ను బ్రతిమిలాడారు.... అత్తయ్యగారూ.... మీ కుమారుడు మీకేదో బద్రపరచమని ఇచ్చారు.... అదేంటో మాకూ చూపించవచ్చు కదా అని.

అందుకు నేను ససేమిరా అన్నాను.... కాని వారు ఎంతకూ వినిపించుకోలేదు.... చాలా నిష్టూరంగా మాటలాడినారు. అదేంటత్తయ్యా..... మీకు.... మీ కుమారునికి మేమే అంటరానివారమయ్యామా అనీ.... అవునులే ఇన్నాళ్ళూ మేము పనికివచ్చాము.... ఇప్పుడు మీరొచ్చారుగా ఇక మేమెందుకు పనికివస్తాము అనీ.... సరే ఇక మీరూ మీ కుమారులే ఉండండి.... మేము మా తల్లిగారిండ్లకు వెళ్తాం అనీ.... ఇలా ఎన్నెన్నో మాటలాడారు బాబూ.... 

నేనువచ్చి మీ మద్య ఎందుకు గొడవలు పెట్టడం అని దానిని తీసి వారకి చూపించాను. అంతే....

నలుగురు కోడళ్ళు ఒకేచోట కూర్చోని ఆ వస్త్రాన్ని కప్పుకొని గాలిలో ఎగిరిపోయారు.... ఇంతకూ ఎవర్రా వాళ్ళంతా అని అడిగింది అమ్మ....

నిస్తేజంగా అలాగే గోడకు కూలిపోయాడి యువరాజు..... అందరూ తనను తీసుకెళ్ళి మంచంమీద పడుకోబెట్టి అసలు విషయం అడుగుతారు.  అప్పుడు జరిగిందంతా చెప్పి.... ఇక తన భార్యలు లేనిది నేనూ రాజ్యంలో ఉండననీ.... చెప్పి తన రాజ్యాన్ని తన సోదరులకు అప్పగించి తను తన దేవకన్యలను వెతుకుతూ బయలుదేరుతాడు.

ఎంత వెతికినా వారి ఆచూకి మాత్రం తెలియరాలేదు.  చివరికి పేదరాశిపెద్దమ్మ ఇంటికి చేరుకుంటాడు.

పేదరాశిపెద్దమ్మ కాళ్ళపై పడిపోయి ఎక్కి ఎక్కిఏడుస్తూ జరిగిందంతా చెబుతాడు.

అప్పుడు పేదరాశిపెద్దమ్మ కూడా తనవలన ఏమీకాదనీ తేల్చి చెబుతుంది. మరెలా అని బ్రతిమిలాడుకుంటాడు. అప్పుడు ఒక్క విషయం మాత్రం చెబుతుంది....

ఎక్కడైతే నీవు మొదటిసారి రాకుమార్తెను చూశావో.... తిరిగి అక్కడికే బయలుదేరు. అక్కడ నీ దేవకన్య కనిపిస్తుంది. వెళ్ళి అడిగి తీసుకొచ్చుకో.... అని చెబుతుంది. 

తెల్లవారకముందే సరస్సు చేరుకున్నాడు రాకుమారుడు, అప్పటికే దేవకన్య చెలికత్తెలతో స్నానమాచరిస్తుంది. ఆ ప్రదేశం వరకు వెళ్లి..... తన భార్యను పట్టుకోపోతాడు. వారు ఇతనికి అందకుండా.... గుర్తుకూడా పట్టకుండా దొరకకుండా జలకాలడి బట్టలు మార్చుకుంటుంటారు.   రాకుమారుడు ఎంత బ్రతిమిలాడినా వినిపించుకోకుండానే దేవలోకానికి బయలుదేరి వెళ్తారు.
ఎంతో నిరాశ చెందిన రాకుమారుడు తన పట్టుమాత్రం వదలకుండా మరుసటిరోజువరకు అక్కడే వాఎఇకోసం నిద్రాహారాలు మాని ఎదురుచూస్తాడు. తెల్లవారింది .... దేవకన్నయలు ఎప్పిటిలాగే జలకాడటం కోసం వచ్చారు. ఇక వారిని కలిసి ప్రయోజనం లేదనుకొని ఆ ప్రక్కనే వారి రథం ఉంది,  వెళ్ళి రథం కింద దాచుకున్నాడు.... దేవకన్య జలకాలాడి రథం ఎక్కి బయలుదేరి వెళ్ళబోతుండగా.... రాకుమారుడు అ రథం కింద దాచుకొని రథంతో పాటు దేవలోకం చేరుకుంటాడు.

ఇంకా ఉంది 11


రాజుకు నలుగురు... 9వ బాగం



రాజుకు నలుగురు... 9వ బాగం

రాకుమారుడు ఇంటినుండి తప్పించుకొని వెళ్ళిపోయాక తన తండ్రి రాజ్యం పై శత్రు సైన్యం దాడిచేసి రాజ్యాన్ని వశపరుచుకొని రాజకుటుంబాన్ని కొన్ని రోజులపాటు బందీలుగా చెరసాలలో బంధించి కొన్నేళ్ళ తరువాత విడుదల చేశారు. ఆ తరువాత వారు బిక్షాటన చేసుకుంటూ ఊరూరా తిరుగుతూ.... యువరాజు ఏలుతున్న రాజ్యానికి వస్తారు.

ఇంటింటికి తిరిగి బిచ్చమెత్తుకుంటుండగా రాజబటులు దొంగలనే అనుమానంతో వారిని బంధించి రాజమందిరానికి తీసుకొని వస్తారు.

రాజుముందు వారిని ప్రవేశపెట్టి విచారించగా....  వారు రాజుకు నమస్కరించి తమ వివరాలు తెలియజేస్తారు. పూర్రిగా గడ్డం పెంచుకొని.... చిరిగిన బట్టలతో కృంగి కృషించుకపోయి ఉన్నవారిని యువరాజు గుర్తించలేక పోతాడు.

వారు చెప్పిన వివరాలు విని ఉలిక్కిపడి.... వీరు తన తల్లిదండ్రులని గుర్తించి వారికి పాదాభివందనం చేసి నేను మీ కుమారున్ని అని చెప్పి వారందరిని తన రాజమదిరానికి ఆహ్వానించి తండ్రికి, సోదరులకు క్షౌరాది కృత్యాలు చేయించి నూతన వస్త్రాలు అందిస్తాడు.

తన భార్యలను పరిచయం చేసి వీరే నేను బాల్యంలో దూరమైన నా కుటుంబసభ్యులనీ.... వీరికి ఎలాంటి లోటుపాట్లు కలగకుండా చూసుకోవాలని అందరికి ఆజ్ఙాపిస్తాడు.

ఆతరువాత తన తండ్రి రాజ్యంపై దండెత్తిన వారి వివరాలు సేకరించి.... తన తండ్రి, సోదరులు, సైన్యాన్ని వెంటబెట్టకోని యుద్దానికి తరలివెళుతారు....

యుద్దానికి వెళ్ళేముందు పేదరాశి పెద్దమ్మ మాటలు జ్ఙప్తికొచ్చి తన తొడలో పెట్టుకున్న దేవకన్య వస్త్రాన్ని తన మాతృమూర్తి కి ఇచ్చి .... మంత్రోపదేశం చేసి....  ఎట్టి పరిస్థితులు ఈ వస్ర్తాన్ని ఎవరికీ చూపించవద్దని తన తల్లికి చెప్పి వారు యుద్దానికి బయలుదేరి వెళుతారు.

వీరోచిత పొరాటం చేసి విజయం సాధించి రాజ్యాన్ని తన తండ్రికి అప్పగించి తిరుగు ప్రయాణమవుతారు.

విజయగర్వంతో ఇంటికి రాగానే హారతులిచ్చి స్వాగతం పలకాల్సిన తన భార్యలు రాకపోయేసరికి విచారంగా ఇంట్లోకి వెళ్తాడు.

ఇంట్లో ఎలాంటి సందడి లేకపోగా.... తన భార్యలు కనిపించకపోయేసరికి తన తల్లిని విషయం అడుగుతాడు.

అప్పుడు తల్లి విచారంగా జరిగిన విషయం ఇలా చెబుతుంది.

ఇంకా ఉంది.... 10

రాజుకు నలుగురు... 8వ బాగం


రాజుకు నలుగురు 8వ బాగం

అలా బయటకు వచ్చి భర్తకు కడుపునిండా భోజనంపెట్డి తినిపిస్తూ ఇలా చెబుతారు...

మేమొక ఉత్తరం ఇస్తాము, దానిని ముందుగా అగ్నిలో వేసి ఆతరువాత మీరు అగ్నిలో దూకండి. అంతా ఆ అగ్ని దేవుడే చూసుకుండాడు. అని ధైర్యం చెబుతారు ముగ్గురు భార్యలు.

ఇక ఉదయమే మంత్రి వద్దకు వెళ్ళి తన అంగీకారం తెలియజేస్తాడు.

మంత్రి రాజుగారి అనుమతితో పెద్ద అగ్ని హోత్రాన్ని ఏర్పాటుచేస్తారు

మంచి ముహూర్తాన రాజు, మంత్రి, పురప్రజల సమక్షములో అగ్ని ప్రవేశానికి సంసిద్దమవుతుండగా..... రాజు గారు తమ పితృదేవతలకు ఇవ్వవలసిన బంగారు పత్రంపై వ్రాసిన ఆహ్వానపత్రికలను సేనాధిపతి కి ఇచ్చి.... ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తే.... నిన్ను సామంత రాజును చేస్తానని ప్రజలముందు వాగ్దానం చేస్తాడు.

ఇక గత్యంతరం లేని పరిస్థితులలో రాకుమారుడు తన భార్యలు చెప్పినట్లుగా అగ్ని దేవునికి నమస్కరించి భార్యలు ఇచ్చిన లేఖను అందులో వేసి అందరికీ నమస్కరించి తానూ అగ్నిలో దూకుతాడు.

మంత్రి మనస్సులో పీడవదిలింది అని తనలోతను సంతోషపడుతూ.... ఇంటికి వస్తాడు.

ఇక తనకు అడ్డెవరూలేరనీ.... రాకుమారుని ముగ్గురు భార్యలు ఇక తనవశం కానున్నారని విందుఏర్పాటుచేసి ఆనందంగా కలలుగంటుంటాడు.

ఒకటి, రెండు, మూడు, ఇలా వారం రోజులైనా రాకుమారుడు రాకపోయేసరికి రాజుతో పాటు పురప్రజలందరూ అవేదనకు లోనవుతుంటారు.

రాజు ఇక ఆపుకోలేక మంత్రిని పిలిపించి... రాకుమారుని జాడ ఏమైనా తెలిసిందా అని అడగుతాడు. అందుకు మంత్రి రాజా... అంతటి అగ్ని హోత్రంలో దూకిన ఏ మనవుడైనా కాలిబూడిదవ్వడమే తప్ప తిరిగి రావడముంటుందా అంటాడు. అవునా అయ్యో.... మన సైన్యాధిపతి ని మనం కోల్పోయినట్టేనా.... సరే ఆ మంటలను ఆర్పించి అతని ఆనవాళ్ళు ఏమైనా ఉంటే తన కుటుంబసభ్యులకు అందజేయండి అని ఆజ్ఙాపిస్తారు.

మంత్రి తన అనుచరులతో అగ్నిని ఆర్పించే ఏర్పాట్లు చేస్తుండగా.... అగ్బిలోంచి మరో అందమైన సుందరితో బయటకు వస్తుంటాడు రాకుమారుడు.

అదిచూసిన మంత్రి గుండె ఆగినంతొనౌతుంది. రాజుగారికి విషయం తెలువగానే బాజాబదంత్రీలతో పయరంలోకి తీసుకువస్తారు....

తనభార్యలు అగ్నిదేవుని కూతుర్ని సాదరంగా ఆహ్వానించి ఎలాజరిగింది ప్రయాణం అని అడుగుతారు.

అందుకు రాకుమారుడు ఈ విధంగా తెలియజేస్తాడు. మీరిచ్చిన లేఖను అగ్నిహోత్రంలో వేయగానే అప్పటివరకూ వేడిగా ఉన్న ఆప్రదేశం నామటుకు ఒక్క సారిగా చల్లగా మారిపోయింది, ఇక అందులో దూకగానే ఇద్దరు భటులు రథంతో సిద్ధంగా ఉన్నారు. నన్నుఅగ్ని దేవుని వద్దకు తీసుకెళ్ళి నా పనులను అన్నీ చేసిపెట్టి తన కూతురును ఇచ్చి వివాహం చేసి పంపించారు అని తన అనుభవాలు తన భార్యలతో పంచుకున్నాడు.

రాజుగారు ఇచ్చిన మాటమీద సైన్యాధిపతి ని ఓ రాజ్యానికి సామంతరాజుగా ప్రకటిస్తాడు.

నలుగురు భార్యలతో పాటు రాజ్యాధికారాన్నికూడా చేపట్టడంతో కుమిలిపోతూ ఉన్న మంత్రి మానసిక వ్యధతో మంచం పడుతాడు.

ఇలా రాజ్యాధికారాన్ని కొనసాగిస్తుండగా ఒకరోజు ఏంజరిగిందంటే....

ఇంకాఉంది... 9


రాజుకు నలుగురు..... 6వ బాగం...


రాజుకు నలుగురు 6వ బాగం

ఆ దేశపు మంత్రి స్త్రీ లోలుడు.... తన కంట పడితే చాలు... ఎలాంటి అమ్మాయినైనా వశపరుచుకోవడమే తనలక్ష్యం

ఒకరోజు యువరాజుని రాజు తన అంతరంగిక రక్షకుడిగా నియమిస్తూ సభకు పరిచయం చేస్తాడు. అప్పటికే  వారిద్వారా.... వీరిద్వారా యువరాజు భార్య అందం విషయమై తెలుసుకున్న మంత్రి ఎప్పుడెప్పుడు తనను చూడాలా అని ముచ్చట పడేవాడున అలా ఆరోజు చూసింది మొదలు ఇక ఆ దేవకన్యను వశపరుచుకోవడమే తన లక్ష్యంగా పెట్టుకొని తదనుగుణంగా పావులు కదపడం మొదలెట్టాడు.

రాకుమారుని భార్య దేవకన్య పై మనసుపడ్డ మంత్రి ఎలాగైనా రాకుమారున్ని హతమార్చి ఆ దేవకన్యను తన స్వంతం చేసుకోవాలని కుఠిలయత్నాలు చేస్తుంటాడు.

ఇందులో బాగంగా ఒకరోజు రాత్రి మంత్రి రాకుమారున్నిపిలుస్తాడు.

రా సేనాధిపతీ.... రా.... నీతో ఒక రహస్య విషయం తెలియజేయవలెను.... అందుకే ఈ వేళలో పిలిపించాను అంటూ పిలిచిన విషయాన్ని వివరిస్తాడు.

రాణి గారు ఒక రుగ్మతతో బాధపడుతుంది. దానికి నాగమణి తోనే వైద్యం నయమవుతుందని వైద్యులు నిర్దారించారు. ఇందుకు సమర్ధునివి నీవే అని రాజుగారు నీకీ పని అప్పగించమన్బారు.  ఎలాగైనా అడవిలోకేగి ఈ పౌర్ణమినాడు మాత్రమే వెలువడే ఆ నాగమణిని తీసుకొని రావాలి అని ఆదేశించాడు.

సరే అని మాటిచ్చి ఇంటికి చేరుకున్న రాకుమారుడు ఏదో సుదీర్ఘంగా ఆలోచిస్తుండగా తన భార్య దేవకన్య చూసి .... నాధా మీరెందుకు ఇంతగా ఆలోచిస్తున్నారు.. అదోలా ఉన్నారు అనగానే... ఉలిక్కిపడ్డ రాకుమారుడు అదేంలేదంటూ తటపటాయించాడు.... వెంటబడి అసలు విషయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేసింది దేవకన్య.... విషయం తెలిస్తే ఎక్కడ భయపడుతుందో అని నిదానంగా బయపడుతూ బయపడుతూ అసలు విషయం చెప్పాడు రాకుమారుడు.

అంతా వినగానే ఎలా ప్రతిస్పందిస్తుందో అని బయంతో ఉన్న సమయంలో రాకుమారి నోట ఓస్ ఈ దానికే ఇంత
బయమెందుకు రా తినుకుంటూ మాట్లాడుకుందాం అంటూ ధైర్యం చెప్పిలోనికి తీసుకెళ్ళింది....

అప్పుడిలా చెప్పింది దేవకన్య.... చూడండీ నాగరాజు మరెవరో కాదు... మా బాబాయే అవుతాడు. నేను బాబాయ్ కి లేఖ రాసి ఇస్తాను నీకు రాచమర్యాదలు చేసి నాగమణి ని ఇచ్చి పంపిస్తాడు అని చెప్పి నాగరాజు చిరునామాతో సహా ఇచ్చి పంపిస్తాడు.

ఆ ప్రకారంగా వెళ్లిన రాకుమారుడు అడవిలోకి వెళ్ళి నాగమందిరంలో గల పెద్ద పుట్టలో ఈ లేఖను వేయగానే నాగరాజు తన బృందంతో మేళతాళములతో వచ్చి అల్లుడిని తీసుకొని వెళ్తాడు....

క్షేమ సమాచారములు తెలుసుకొని తనడిగిన నాగమణి తో పాటు తన కూతురు నాగకన్య ను కూడా ఇచ్చి పెళ్ళిచేసి పంపుతారు...

తనను.... తన రెండవ భార్యను ఇద్దరినీ సాధరంగా ఇంట్లోకి ఆహ్వానించింది దేవకన్య...

ఇక నాగమణి కోసం వచ్చిన మంత్రిగారికి నాగకన్య దర్శనమివ్వడంతో మెదడు మొద్దుబారిపోయింది.  ఇంకేమీ మాట్లాడక నాగమణికూడా తీసుకోకుండా వెళ్లిపోయాడు.

ఇక మంత్రికి ఎటూ తోయడం లేదు.
ఏంటీమాయ.... అసలే మొదటిది అందెగత్తె అనుకుంటే.... దానిని మించిన అప్సరస ఇప్పుడొచ్చి చేరింది....  వీడిని లేపేస్తే ఒకతి నాకు.... ఇంకొకతి రాజుకు ఉంపుడుగత్తెగా ఉంటుంది అనుకుంటూ... మరో ఎత్తుగడకు పూనుకున్నాడు మంత్రి.

ఇంకా ఉంది 7

రాజుకు నలుగురు.... 7వ బాగం



రాజుకు నలుగురు 7వ బాగం

వీడిని పాములు ఏమీ చేయలేక పోయాయి.... దానికన్నా పెద్ద ఎత్తే వేయాలి అని ఆలోచించి ..... 
సేనాధిపతి తో తిరిగి సమావేశమయ్యాడు మంత్రి.... నాగమణితో నయమవ్వదట రాణిగారి సమస్య.... మృగరాజు కోరలు కావాలంట అని మరో ఎత్తుగడ వేస్తాడు మంత్రి..... అదేంటి రాజా అన్నిటికీ నన్నే పంపిస్తున్నారు అని అడుగగా.... నీవైతేనే సమర్ధుడవు అని రాజుగారు గుర్తించి నిన్నే పంపిస్తున్నారు.... అని చెప్పి పంపించాడు. 

ఎప్పటిలాగే ఇంట్లికెళ్ళాక తిరిగి బాధపడుతుండగా ఇద్దరు భార్యలు వచ్చి విషయం అడిగి తెలుసుకొని నవ్వుకుంటారు.... వారిని తదేకంగా చూసి.... ఏంటి నేను మృగరాజు చేతిలో మరణించాలని చూస్తున్నారా.... తెగ ఆనందపడిపోతున్నారు అని అనగానే.... ఇద్సరూ అయ్యో అలాకాదండీ అంటూ అసలు విషయం చెప్పారు. మృగరాజు మాకు చాలా కావాల్సినవారు మీకెందుకు భయం.... మీరు నిశ్ఛింతగా వెళ్ళిరండి అని చెప్పి పంపిస్తారు. భార్యలు చెప్పినట్టుగానే వెళ్ళి మృగరాజుతో రాచమర్యాదలు పొంది మృగరాజు కుమార్తెను కూడా పెళ్ళిచేసుకొని వస్తాడు రాకుమారుడు.....

ఇద్దరు భార్యలు కలిసి కొత్త దంపతులకు స్వాగతం పలుకుతారు.... 

బంట్లద్వారా విషయం తెలుసుకున్న మంత్రి హుటాహుటిన రాకుమారుని ఇంటికి వచ్చి మూడో భార్యను చూసేసరికి కళ్ళుచెదిరిపోయి పడిపోతాడు.... 

నిద్రాహారాలు మాని ఇక లాభం లేదు ఈ సారి వీడిని చంపేందుకు పెద్ద ఎత్తేవేయాలి అని ఆలోచించి.... ఆలోచించి.... ఒక నిర్ణయానికి వస్తాడు.... ఈ సారి తను చెబితే నమ్మడని తెలిసి రాజు గారిద్వారా చెప్పించే ప్రయత్నం చేశాడు.....

ఒక రోజు తన ముగ్గురు భార్యలతో కలిసి ముచ్చటిస్తుండగా.... రాజుగారి నుండి కబురొస్తుంది.... 

హుటాహుటిన వెళ్ళిన రాకుమారునికి రాజుగారు మంత్రి మాటలువిని ఈ విధంగా విషయం చెప్పాడు....

సేనాధిపతీ.... మేము మా పితృకార్యాలను తలపెట్టదలిచాము.... మీరు ఆ విషయాన్ని మా పితృదేవలకు తెలియజేసి రావలెను అని చావుకబురు చల్లగా చెబుతాడు.

అదెలా మహారాజా అని ఆశ్చర్యంగా అడిగిన రాకుమారున్ని చూసి... ఎలా వెళ్ళాలో ఏంటో మా మంత్రి గారు వివరిస్తారు అని రాజుగారు బయలుదేరి వెళ్ళిపోతారు.

మంత్రి ఇలా చెబుతున్నాడు.... ఏమీలేదు యోధుడా.... మేము అడవిలోని ఎండిపోయిన చెట్ల్టన్నీ చితిగా పేరుస్తాము.... అట్టి అగ్నిలో దూకి రాజుగారి పితృదేవులందరికీ ఆహ్వానపత్రాలు అందజేసి రావాలి అని చెప్పాడు.

అగ్నికి ఆహుతయ్యాక బూడిదే కదా అయ్యేది.... తిరిగి రావడం ఎలా అనుకుంటూ... ఇంటికొచ్చేసరికి.... ముగ్గురు భార్యలు ఎదురుచూసి ఆహ్వానిస్తారు.... ఏంటని విషయం అడిగి తెలుసుకొంటారు.... ముగ్గురు నిశ్శబ్ధంగా లోపలికి వెళ్ళగానే రాకుమారుడు నీరసపడిపోతాడు.... ఇక చేసేది ఏమీలేదనుకొంటుండగా.... ముగ్గురూ నవ్వుకుంటూ బయటకు వస్తారు.

ఇంకా ఉంది 8వ బాగం

రాజుకు నలుగురు..., 5వ బాగం


రాజుకు నలుగురు 5వ బాగం

ఒకరోజు ఆ ప్రాంతానికి చెందిన రాజు వేటకని వీరుండే ప్రాంతానికి వస్తారు. అయితే రాజుపై కొందరు గజదొంగలు అదును చూసి దాడికి పాల్పడితారు. అక్కడే పశువులను మేపుకుంటూ తిరుగుతున్న యువరాజు ఆ దుండగలబారినుండి రాజును రక్షిస్తాడు. 

గాయాలతో బాధపడుతున్న ఆ రాజును యువరాజు పేదరాశి పెద్దమ్మ ఇంటికి తెచ్చి జరిగిన విషయం అమ్మతో చెబుతాడు. పేదరాసి పెద్దమ్మ రాజుకు వైద్యం చేసింది. 

కాసేపు విశ్రాంతి తీసుకున్నాక రాజు వారికి కృతజ్ఙతలు తెలిపి , యువరాజు పోరాటాన్ని ప్రశంసించి, మీకేవిధంగా సహాయం పడగలనో తెలపండి అని వారితో అనగానే.... పెద్దమ్మ నా మనవడికి మీ రాజ్యంలో ఏదైనా కొలువు ఇప్పించండి మహారాజా మీకు ఋణపడిఉంటా అని వేడుకుంటుంది. 

అందుకు ఆ రాజు భలే పెద్దమ్మ భలే... మా మనసులోని కోరికను మీరే వెల్లడించారు... ఈ క్షణం నుండి ఈ ధీరున్ని నా అంతరంగ రక్షకునిగా నియమిస్తున్నాను. అని రాజువెళ్లిపోతాడు..

ఒక శుభముహూర్తాన పేదరాసి పెద్దమ్మ.వారిద్దరినీ రాజ్యానికి చేరవేసి, రాజుకు అప్పగించి వారితో కొత్తకాపురం పెట్టిస్తుంది.

 అలా అన్యోన్యంగా వారి దాంపత్యం కొనసాగుతుండగా.... ఒకరోజు....

ఇంకాఉంది ... ,6వ బాగం


రాజుకు నలుగురు - 4వ బాగం


రాజుకు నలుగురు 4వ బాగం

ఆరోజు సూర్యోదయం కాకముందే పశువులను తోలుకుంటూ ఉత్తరం దిశగా వెళ్తాడు.... 

అక్కడ అందమైన సరస్సు ఉంది.... సుగందాలు వెదజల్లే చక్కటి పూతోటలు.... 

చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం.... అసలు ఇది భూమ్మీదేనా అన్నట్టు ఉంది.... అంతేకాదు.... ఆ పక్కనే సరస్సులో దేవకన్యలు జలకాలాడుతున్నారు..... ఇంకేముంది రాకుమారుని కళ్ళు జిగేల్ జిగేల్ మన్నాయి .... వారి వస్త్రములు ఓ పక్క పడేసి ఉన్నాయి.... వెంటనే వాటిని తీసుకొని పరుగెత్తడం ప్రారంభించాడు..... అది కనిపెట్టిన దేవకన్నికలు రాకుమారుని వెంట నగ్నంగా పరిగెత్త ప్రారంభించారు.  వారు నన్ను చూడు నా అందం చూడు... మానవా నన్ను చూడు నా అందం చూడు అనుకుంటూ వస్తున్నారు. ఏంటబ్బా అనుకుంటూ.... సరే ఒకసారి వారందం కూడా చూస్తే పోలా అనుకోని వెనక్కు తిరిగి చూస్తాడు.... అంతే అక్కడే శిల్పమై పొతాడు. 

ఆ దేవకన్యలు వచ్చి తమ బట్టలు తీసుకొని ఇంద్రలోకం వెళ్తారు....
సాయంసమయం అయినా రాకుమారుడు ఇంకా రాకపోవడంతో ఎందుకో పేదరాశి పెద్దమ్మకు అనుమానం వచ్చి ఉత్తరం దిశగా వెళ్తుంది.... చుట్టుప్రక్కల పశువులు మేస్రూయుండగా ఓ శిల అక్కడ నిలుచొని ఉంటుంది. పెద్దమ్మ కు అనుమానం వచ్చి మంత్రజలం చల్లగానే ఆ శిల్పం రాకుమారునిగా మారుతుంది. మనవడిని తీసుకొని ఇంటికి వస్తారు. 

నేనటు వెళ్ళొద్దన్నా.... ఎందుకు వెళ్ళావురా... నేనురాకుంటే నీ గతి ఏంకాను... అంటూ తిడుతుంది. ఆ రాకుమారుడు ససేమిరా అంటున్నాడు... నాకా కన్య కావాలంటూ పట్టుపట్టాడు.
పెద్దమ్మను బ్రతిమిలాడుకున్నాడు. 
తినకుండా అలిగి పండుకున్నాడు. 
ఇక కాదనలేక పెద్దమ్మ ఒక సలహా ఇచ్చింది. ఉదయమే ఎప్పటిలాగే వెళ్ళి వాళ్ళు స్నానమాడుతుండగా  ఒక కన్య బట్టలు తీసుకొని పరెగెత్తుకొని రా.... వాళ్ళు నన్నుచూడు నా అందం చూడు అనుకుంటూ నిన్ను వెంబడిస్తారు... 
నువ్వు అస్సలు వెనుకకు చూడకుండా వచ్చేయి... మిగిలిన తంతు నేను చూసుకుంటా అని చెప్పి పంపిస్తుంది పెద్దమ్మ.

రాకుమారుడు కూడా అలాగే పెద్దమ్మ చెప్పినట్టు చేస్తాడు.... ఆ వస్త్రాలు తీసుకొని వెనక్కి చూడకుండా పరిగెత్తుకుంటూ కుటీరానికి చేరుకోగానే.... ఆ పెద్దమ్మ ఆ వస్ర్తాన్ని తన మంత్ర శక్తితో తనతొడలో పెట్టుకుంటుంది. రాకుమారున్నిదాచేస్తుంది

అర్ధనగ్నంగా పరుగెత్తుకుంటూ వచ్చిన దేవకన్య... అవ్వా... ఇక్కడికెవరైనా నా వస్త్రాలతో వచ్చారా అని అడుగగానే పెద్దవ్వ లేదమ్మా... ముందు ఆ బట్టలు చుట్టుకో అని తన బట్టలు ఇస్తుంది. 

దేవతా వస్త్రాలు లేకుండా తను దేవలోకం పోలేదని పెద్దమ్మకు తెలుసు.... అందుకే ఆ బట్టలు మాయం చేసింది. ఇక తన మాయతో ఆ కన్యను కూడా తనవద్దనే ఉంచుకోసాగింది.... 

అలా వారిద్దరినీ మాయలోపడేసి... ప్రేమలోదింపి ఇద్దరికీ పెళ్ళిచేస్తుంది.
ఆతరువాత....

ఇంకాఉంది. 5


రాజుకు నలుగురు - 3వ బాగం


రాజుకు నలుగురు - 3వ బాగం

సాయంత్రం అవ్వగానే ఒక కొలను ప్రక్కన కూర్చోని సేద తీర్చుకుంటుండగా చిన్న చిన్న కప్పలను గోండ్రు కప్పలు వేటాడుతూ తింటుంటాయి .... వాటినికూడా కాపాడి.... వాటి అభయాన్నికూడా పొంది ఇక బయలుదేరుతాడు....

రాత్రంతా ప్రయాణం చేసీ.... చేసీ అలసిపోయి నది ఒడ్డున గల ఓ పురాతన గృహం ముందు చేరుకుంటాడు.
అక్కడ తన అశ్వాన్ని ఆపి ఎవరు లోపల అని పిలవగానే ఓ వృద్ధురాలు బయటకు వస్తుంది .... ఎవరుబాబూ నీవు అని అడిగి కాళ్లు కడుక్కోని లోపలికి రమ్మంటుంది... లోనికివెళ్ళి.... అమ్మా మీపేరేమి, మీరుఒక్కరే ఇక్కడ ఏల నివసిస్తున్నారని సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేయగా .... తనపేరు పేదరాశి పెస్దమ్మ అని అంటారని.... తనకెవరూలేరనీ... ఇక  అంతకు మించి తననేమీ అడగవద్దనీ.... చెప్పి. నీకు వీలైనన్ని రోజులు తనవద్ద ఉండమని చెబుతుంది పేదరాశిపెద్దమ్మ.

తన వద్ద ఉన్న పశువులు కాసుకుంటూ నాకు చేదోడు వాదోడుగా ఉండమని చెబుతూ.... తూర్పు, పడమర, దక్షణ దిశలకు వెళ్ళు కానీ.... ఉత్తరం దిశకు మాత్రం వెళ్ళొద్దని చెబుతుంది ఆమె.
రాకుమారుడు తన వద్ద ఉన్న నాణేలు ఆమెకు ఇచ్చి ఇక అక్కడే ఉంటుంటాడు.

రోజుకు ఓ వైపు పశువులను కాసుకుంటున్న రాకుమారుడు ఉత్తరం వైపుకు ఎందుకు వద్దన్నదా అనే అనుమానంతో ఎలాగైనా ఈరోజు ఉత్తరం వైపు వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు.

ఇంకాఉంది.....4

రాజుకు నలుగురు - 2వ బాగం



రాజుకు నలుగురు 2

రాజు నిర్ణయానికి రాణి ఉలిక్కి పడుతుంది. గారాలకొడుకుకు ఉరిశిక్షా.... ఏంటీ నాకీశిక్ష అంటూవేదన చెందుతూ దీనికేదైనా తరుణోపాయం ఆలోచించాలంటూ రాత్రంతా నిదురలేకుండా... ఆలోచిస్తూ.... అందరూ పడుకున్న సమయంలో తనవద్ద ఉన్న బంగారు నాణాలను ఒక మూటలో కట్టి, తినడానికి రొట్టెలు పెట్టి అశ్వాన్ని ఇచ్చి.... ఎటైనా పారిపో అని చెప్పి కొడుకును ఏడుస్తూ పంపించి వేస్తుంది ఆ తల్లి హృదయవేదనతో.....

తల్లి పాదాలకు నమస్కరించి బయలుదేరిన రాకుమారుడు.... రాత్రంతా అశ్వంపై ప్రయాణం సాగిస్తూ.... సాగిస్తూ.... తన రాజ్యాన్ని దాటి అడవులద్వారా ప్రయాణం సాగిస్తుంటాడు.... తనకు బాగా దాహం వేస్తుండటంతో దూరంలో కనిపిస్తున్న నదివద్దకు వెళ్ళి దాహార్తి తీర్చుకుందామనుకుంటుండగా.... ఆ నీటిలో కొట్టుకుపోతున్న చీమలు రాకుమారున్ని చూసి ఆర్తిగా చూస్తుంటాయి. వాటి బాధను అర్ధం చేసుకున్న రాకుమారుడు ఒక కర్ర సహాయంతో ఆ చీమలన్నిటినీ పక్కనున్న ఒడ్డుకు సురక్షితంగా చేరుస్తాడు. ఆ చీమలన్నీ ఆ రాకుమారునికి కృతజ్ఞతలు తెలిపి రాకుమారా నీకెప్పుడు ఏ సహాయం కావాల్సినా మమ్మల్ని పిలువు వెంటనే వచ్చి నీకు సహాయం చేస్తాము అని చెప్పి వెళ్తాయి .....

రాకుమారుడు కాసేపు విశ్రాంతి తీసుకోని తిరిగి ప్రయాణం చేస్తుండగా.... మధ్యాహ్నం వేల ఓ చెట్టుకింద విశ్రాంతి తీసుకుంటుండగా ... తుమ్మెదలపై దాడి జరుగుతుంది. అప్పుడు యువరాజు ఆ తుమ్మెదలను కాపాడి రక్షిస్తాడు .... ఆ తుమ్మెదలు కృతజ్ఙతాభావంతో రాకుమారా.... నీకెప్పుడు మా సహాయం కావాల్సివచ్చినా మాకు తెలియజేయండి.... మీకు మా వంతు సహాయసహకారాలను అందిస్తాము. అని చెప్పి వెళ్ళిపోతావి. రాకుమారుడు తాను తెచ్చుకున్న రొట్టెలు తిని తిరిగి బయలు దేరి వెళ్తుంటాడు....

ఇంకాఉంది.....3

రాజుకు నలుగురు - 1వ బాగము


రాజుకు నలుగురు 1

అనగనగా ఒక రాజు, ఆ రాజుకు నలుగురు కుమారులు. ఒకరోజు రాజు వెన్నెల రాత్రిలో చందమామ కింద పట్టెమంచంపై పడుకొని తనకుమారులను ఒక్కొక్కరిని పిలిపించి ఇలా అడుగుతున్నాడు.

కుమారా .... ఈ సమయంలో నీకేమి చేయాలని పిస్తుంది అని అడుగగానే పెద్దవాడు ఇలా సమాదానం చెబుతాడు.
తండ్రీ .... శత్రుసైన్యంపై దండెత్తి పొరుగు రాజ్యాలను హస్తగతం చేసుకోవాలని ఉంది అనగానే భళాకుమారా భళా.... ఇక నీ వెళ్ళవచ్చు అని పంపిస్తాడు.

ఇక రెండవవాడి సమాదానం ఇలా ఉంది... తండ్రీ .... ఈ సమయంలో మన సైనికులకు యుద్ద నైపుణ్యతలో శిక్షణ అందించాలని ఉంది అనగానే కొడుకును మెచ్చుకొని వెళ్ళమంటాడు.

ఇక మూడవవాడు... తండ్రీ ఈ సమయంలో అశ్వ విహారం చేస్తూ శతృగూడాచార రహస్యాలను తెలుసుకోవాలని ఉంది అంటాడు.... రాజుగారు తన పుత్రులకు రాజ్యము పై ఉన్న ఆకాంక్షను చూసి ఉబ్బితబ్బిబైపోతాడు.

చివరివాడిని పిలిచి కుమారా ఈ పున్నమి వెన్నెల సమయంలో నీకేమి చేయాలనిపిస్తుందో సెలవియ్యమనగానే....

తండ్రీ..... పట్టె మంచంపై పడుకొని... నాలుగు ప్రక్కల నలుగురు సురకన్యలు నించుని చామరాలతో వీస్తుండగా.... హాయిగా నిద్రించాలని ఉంది ప్రభూ అని తెలపగానే.....

రాజుగారికి ఎక్కడలేని కోపం వస్తుంది.  చీ దుర్మార్గుడా.... రాజపుత్రుడవయ్యుండి.... రాజ్యక్షేమము కాకుండా నిద్రమత్తును కోరుకుంటావా అంటూ ఎవరక్కడ అని భటులను పిలిచి.... కొడుకనికూడా చూడకుండా వీనికి రేపు సూర్యోదయం అవగానే ఉరిశిక్ష వేయుడు అని ఆజ్ఙాపిస్తాడు....

ఇంకా ఉంది.....2