రాజుకు నలుగురు 5వ బాగం
ఒకరోజు ఆ ప్రాంతానికి చెందిన రాజు వేటకని వీరుండే ప్రాంతానికి వస్తారు. అయితే రాజుపై కొందరు గజదొంగలు అదును చూసి దాడికి పాల్పడితారు. అక్కడే పశువులను మేపుకుంటూ తిరుగుతున్న యువరాజు ఆ దుండగలబారినుండి రాజును రక్షిస్తాడు.
గాయాలతో బాధపడుతున్న ఆ రాజును యువరాజు పేదరాశి పెద్దమ్మ ఇంటికి తెచ్చి జరిగిన విషయం అమ్మతో చెబుతాడు. పేదరాసి పెద్దమ్మ రాజుకు వైద్యం చేసింది.
కాసేపు విశ్రాంతి తీసుకున్నాక రాజు వారికి కృతజ్ఙతలు తెలిపి , యువరాజు పోరాటాన్ని ప్రశంసించి, మీకేవిధంగా సహాయం పడగలనో తెలపండి అని వారితో అనగానే.... పెద్దమ్మ నా మనవడికి మీ రాజ్యంలో ఏదైనా కొలువు ఇప్పించండి మహారాజా మీకు ఋణపడిఉంటా అని వేడుకుంటుంది.
అందుకు ఆ రాజు భలే పెద్దమ్మ భలే... మా మనసులోని కోరికను మీరే వెల్లడించారు... ఈ క్షణం నుండి ఈ ధీరున్ని నా అంతరంగ రక్షకునిగా నియమిస్తున్నాను. అని రాజువెళ్లిపోతాడు..
ఒక శుభముహూర్తాన పేదరాసి పెద్దమ్మ.వారిద్దరినీ రాజ్యానికి చేరవేసి, రాజుకు అప్పగించి వారితో కొత్తకాపురం పెట్టిస్తుంది.
అలా అన్యోన్యంగా వారి దాంపత్యం కొనసాగుతుండగా.... ఒకరోజు....
ఇంకాఉంది ... ,6వ బాగం

No comments:
Post a Comment