Tuesday, June 6, 2017

రాజుకు నలుగురు.... 7వ బాగం



రాజుకు నలుగురు 7వ బాగం

వీడిని పాములు ఏమీ చేయలేక పోయాయి.... దానికన్నా పెద్ద ఎత్తే వేయాలి అని ఆలోచించి ..... 
సేనాధిపతి తో తిరిగి సమావేశమయ్యాడు మంత్రి.... నాగమణితో నయమవ్వదట రాణిగారి సమస్య.... మృగరాజు కోరలు కావాలంట అని మరో ఎత్తుగడ వేస్తాడు మంత్రి..... అదేంటి రాజా అన్నిటికీ నన్నే పంపిస్తున్నారు అని అడుగగా.... నీవైతేనే సమర్ధుడవు అని రాజుగారు గుర్తించి నిన్నే పంపిస్తున్నారు.... అని చెప్పి పంపించాడు. 

ఎప్పటిలాగే ఇంట్లికెళ్ళాక తిరిగి బాధపడుతుండగా ఇద్దరు భార్యలు వచ్చి విషయం అడిగి తెలుసుకొని నవ్వుకుంటారు.... వారిని తదేకంగా చూసి.... ఏంటి నేను మృగరాజు చేతిలో మరణించాలని చూస్తున్నారా.... తెగ ఆనందపడిపోతున్నారు అని అనగానే.... ఇద్సరూ అయ్యో అలాకాదండీ అంటూ అసలు విషయం చెప్పారు. మృగరాజు మాకు చాలా కావాల్సినవారు మీకెందుకు భయం.... మీరు నిశ్ఛింతగా వెళ్ళిరండి అని చెప్పి పంపిస్తారు. భార్యలు చెప్పినట్టుగానే వెళ్ళి మృగరాజుతో రాచమర్యాదలు పొంది మృగరాజు కుమార్తెను కూడా పెళ్ళిచేసుకొని వస్తాడు రాకుమారుడు.....

ఇద్దరు భార్యలు కలిసి కొత్త దంపతులకు స్వాగతం పలుకుతారు.... 

బంట్లద్వారా విషయం తెలుసుకున్న మంత్రి హుటాహుటిన రాకుమారుని ఇంటికి వచ్చి మూడో భార్యను చూసేసరికి కళ్ళుచెదిరిపోయి పడిపోతాడు.... 

నిద్రాహారాలు మాని ఇక లాభం లేదు ఈ సారి వీడిని చంపేందుకు పెద్ద ఎత్తేవేయాలి అని ఆలోచించి.... ఆలోచించి.... ఒక నిర్ణయానికి వస్తాడు.... ఈ సారి తను చెబితే నమ్మడని తెలిసి రాజు గారిద్వారా చెప్పించే ప్రయత్నం చేశాడు.....

ఒక రోజు తన ముగ్గురు భార్యలతో కలిసి ముచ్చటిస్తుండగా.... రాజుగారి నుండి కబురొస్తుంది.... 

హుటాహుటిన వెళ్ళిన రాకుమారునికి రాజుగారు మంత్రి మాటలువిని ఈ విధంగా విషయం చెప్పాడు....

సేనాధిపతీ.... మేము మా పితృకార్యాలను తలపెట్టదలిచాము.... మీరు ఆ విషయాన్ని మా పితృదేవలకు తెలియజేసి రావలెను అని చావుకబురు చల్లగా చెబుతాడు.

అదెలా మహారాజా అని ఆశ్చర్యంగా అడిగిన రాకుమారున్ని చూసి... ఎలా వెళ్ళాలో ఏంటో మా మంత్రి గారు వివరిస్తారు అని రాజుగారు బయలుదేరి వెళ్ళిపోతారు.

మంత్రి ఇలా చెబుతున్నాడు.... ఏమీలేదు యోధుడా.... మేము అడవిలోని ఎండిపోయిన చెట్ల్టన్నీ చితిగా పేరుస్తాము.... అట్టి అగ్నిలో దూకి రాజుగారి పితృదేవులందరికీ ఆహ్వానపత్రాలు అందజేసి రావాలి అని చెప్పాడు.

అగ్నికి ఆహుతయ్యాక బూడిదే కదా అయ్యేది.... తిరిగి రావడం ఎలా అనుకుంటూ... ఇంటికొచ్చేసరికి.... ముగ్గురు భార్యలు ఎదురుచూసి ఆహ్వానిస్తారు.... ఏంటని విషయం అడిగి తెలుసుకొంటారు.... ముగ్గురు నిశ్శబ్ధంగా లోపలికి వెళ్ళగానే రాకుమారుడు నీరసపడిపోతాడు.... ఇక చేసేది ఏమీలేదనుకొంటుండగా.... ముగ్గురూ నవ్వుకుంటూ బయటకు వస్తారు.

ఇంకా ఉంది 8వ బాగం

No comments:

Post a Comment