రాజుకు నలుగురు 8వ బాగం
అలా బయటకు వచ్చి భర్తకు కడుపునిండా భోజనంపెట్డి తినిపిస్తూ ఇలా చెబుతారు...
మేమొక ఉత్తరం ఇస్తాము, దానిని ముందుగా అగ్నిలో వేసి ఆతరువాత మీరు అగ్నిలో దూకండి. అంతా ఆ అగ్ని దేవుడే చూసుకుండాడు. అని ధైర్యం చెబుతారు ముగ్గురు భార్యలు.
ఇక ఉదయమే మంత్రి వద్దకు వెళ్ళి తన అంగీకారం తెలియజేస్తాడు.
మంత్రి రాజుగారి అనుమతితో పెద్ద అగ్ని హోత్రాన్ని ఏర్పాటుచేస్తారు
మంచి ముహూర్తాన రాజు, మంత్రి, పురప్రజల సమక్షములో అగ్ని ప్రవేశానికి సంసిద్దమవుతుండగా..... రాజు గారు తమ పితృదేవతలకు ఇవ్వవలసిన బంగారు పత్రంపై వ్రాసిన ఆహ్వానపత్రికలను సేనాధిపతి కి ఇచ్చి.... ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తే.... నిన్ను సామంత రాజును చేస్తానని ప్రజలముందు వాగ్దానం చేస్తాడు.
ఇక గత్యంతరం లేని పరిస్థితులలో రాకుమారుడు తన భార్యలు చెప్పినట్లుగా అగ్ని దేవునికి నమస్కరించి భార్యలు ఇచ్చిన లేఖను అందులో వేసి అందరికీ నమస్కరించి తానూ అగ్నిలో దూకుతాడు.
మంత్రి మనస్సులో పీడవదిలింది అని తనలోతను సంతోషపడుతూ.... ఇంటికి వస్తాడు.
ఇక తనకు అడ్డెవరూలేరనీ.... రాకుమారుని ముగ్గురు భార్యలు ఇక తనవశం కానున్నారని విందుఏర్పాటుచేసి ఆనందంగా కలలుగంటుంటాడు.
ఒకటి, రెండు, మూడు, ఇలా వారం రోజులైనా రాకుమారుడు రాకపోయేసరికి రాజుతో పాటు పురప్రజలందరూ అవేదనకు లోనవుతుంటారు.
రాజు ఇక ఆపుకోలేక మంత్రిని పిలిపించి... రాకుమారుని జాడ ఏమైనా తెలిసిందా అని అడగుతాడు. అందుకు మంత్రి రాజా... అంతటి అగ్ని హోత్రంలో దూకిన ఏ మనవుడైనా కాలిబూడిదవ్వడమే తప్ప తిరిగి రావడముంటుందా అంటాడు. అవునా అయ్యో.... మన సైన్యాధిపతి ని మనం కోల్పోయినట్టేనా.... సరే ఆ మంటలను ఆర్పించి అతని ఆనవాళ్ళు ఏమైనా ఉంటే తన కుటుంబసభ్యులకు అందజేయండి అని ఆజ్ఙాపిస్తారు.
మంత్రి తన అనుచరులతో అగ్నిని ఆర్పించే ఏర్పాట్లు చేస్తుండగా.... అగ్బిలోంచి మరో అందమైన సుందరితో బయటకు వస్తుంటాడు రాకుమారుడు.
అదిచూసిన మంత్రి గుండె ఆగినంతొనౌతుంది. రాజుగారికి విషయం తెలువగానే బాజాబదంత్రీలతో పయరంలోకి తీసుకువస్తారు....
తనభార్యలు అగ్నిదేవుని కూతుర్ని సాదరంగా ఆహ్వానించి ఎలాజరిగింది ప్రయాణం అని అడుగుతారు.
అందుకు రాకుమారుడు ఈ విధంగా తెలియజేస్తాడు. మీరిచ్చిన లేఖను అగ్నిహోత్రంలో వేయగానే అప్పటివరకూ వేడిగా ఉన్న ఆప్రదేశం నామటుకు ఒక్క సారిగా చల్లగా మారిపోయింది, ఇక అందులో దూకగానే ఇద్దరు భటులు రథంతో సిద్ధంగా ఉన్నారు. నన్నుఅగ్ని దేవుని వద్దకు తీసుకెళ్ళి నా పనులను అన్నీ చేసిపెట్టి తన కూతురును ఇచ్చి వివాహం చేసి పంపించారు అని తన అనుభవాలు తన భార్యలతో పంచుకున్నాడు.
రాజుగారు ఇచ్చిన మాటమీద సైన్యాధిపతి ని ఓ రాజ్యానికి సామంతరాజుగా ప్రకటిస్తాడు.
నలుగురు భార్యలతో పాటు రాజ్యాధికారాన్నికూడా చేపట్టడంతో కుమిలిపోతూ ఉన్న మంత్రి మానసిక వ్యధతో మంచం పడుతాడు.
ఇలా రాజ్యాధికారాన్ని కొనసాగిస్తుండగా ఒకరోజు ఏంజరిగిందంటే....
ఇంకాఉంది... 9

No comments:
Post a Comment