Tuesday, June 6, 2017

రాజుకు నలుగురు.... 11వ బాగం



రాజుకు నలుగురు 11వ బాగం

ఆరథం దేవలోకం చేరగానే.... దేవేంద్రుడు ఒక్కసారిగా.... నరవాసన.... నరవాసన... అంటూ.... అరుస్తుంటాడు..... దేవబటులంతా తిరుగుతూ.... రథం కిందదాచుకున్న రాకుమారున్ని బందించి దేవేంద్రుని ముందు ప్రవేశ పెడతారు....

దేవదేవా.... ఇదుగో మానవ మాత్రుడు.... దొంగచాటుగా దెవకన్య రథంలో దాచుకొని వచ్చాడు అని దేవేంద్రుని ముందు హాజరు పరుస్తారు.

అప్పుడు దేవేంద్రుడు ఓరీ తుచ్చమానవుడా.... ఎంత ధైర్యంరా నీకు.... మా అనుమతి లేకుండా నా లోకప్రవేశం చేస్తావా.... ఇంతకీ ఎవరునీవు.... నీకు మరణశిక్ష విధిస్తున్నాము అని బెదిరించగానే....

రాకుమారుడు శాంతంగా.... వెటకారంగా... మామా దేవేంద్ర.... నన్నే మరిచితివా... అకటకటా.... ఎంతమాట... ఎంతమాట.... మాకు మరణశిక్ష విధించుటయా... మరెందుకు ఆలస్యం ..... మరణశిక్ష విధించండి అంటాడు.

అలాగైతే నాతోపాటు.... ఇన్నాళ్ళూ ఈ మానవ మాత్రునితో ఎన్నో రాత్రులు గడిపిందే నీ గారాల కూతురు.... దానినీ ఉరితీయండి.... మేం కలిసి బ్రతకలేకపోయినా.... కనీసం కలిసైనా చస్తాం అంటాడు.

అందుకు దేవేంద్రుడు నెవ్వరపోయి... వీడేంటి... మామా యనుట ఏంటి? అని అనుకుంటూ అసలు విషయం తెలుసుకుంటాడు.

ఇక ఏంచేయాలో తోచక తన మంత్రివర్గ సమావేశం ఏర్పాటుచేసి ఏ నిర్ణయం తీసుకోవాలో ఆలోచించాడు....

వీరితోపాటు నాగరాజు, మృగరాజు, అగ్నిదేవున్ని కూడా ఆహ్వానించి జరగవలసిన విషయాన్ని చర్చించి ఒక నిర్ణయానికి వస్తారు....

ఇంకాఉంది... 12వ బాగం

No comments:

Post a Comment