రాజుకు నలుగురు 17వ బాగం
రచన: గోగులపాటి కృష్ణమోహన్
మానవా.. ఇదుగో ఈ మహావృక్షం కొన్నేళ్ళ సంవత్సరాల క్రితంది.
ఈ మహా వృక్షాన్ని ఒక్కే ఒక్క గొడ్డలి పెట్టుతో కొట్టి కూల్చిచేయాలి అని పరీక్ష తెలియజేస్తాడు నారదుడు. అంతే కాదు నీవు ఇందుకోసం ఎవరిసహాయం కోరరాదు అని చెప్పి సేవకులారా... ఆయుధాలు తీసుకోనిరండి అని చెప్పగానే... దానికి సంబందించిన పలు విధాల గొడ్డల్లను తీసుకొచ్చి మానవుని ముందుంచుతారు... మానవా నీకు నచ్చిన ఆయుధాన్ని తీసుకోని మీరు పరీక్షలో పాల్గొనవచ్చు అని చెప్పగానే.. తాను తనకు నచ్చిన గొడ్డలి తీసుకోని ఆ మహా వృక్షం వద్దకు వెళ్తాడు...
ఏంటి ఈ రెండు పరీక్షలంటే వాటి సహాయం తీసుకున్నాను... ఈసారి ఎవరి సహాయం తీసుకోకుండా చేయమన్నారు... దీనికి బుద్దిబలం సరిపోదు, దేహబలం కూడా సరిపోదు... మరెలా? అని ఆలోచిస్తూ... తన ఇష్ట దైవాన్ని ప్రార్ధిస్తాడు...
ఇక గొడ్డలి తీసుకొని పైకెత్తి.... దైవాన్ని తలుచుకుంటూ... గట్టిగా ఒక దెబ్బ వేస్తాడు.
అంతే అంతటి మహా వృక్షం పెలపెల మంటూ కిందికి విరుచుకు పడుతుంది... అందరూ ఆశ్చర్యానికి లోనవుతారు... అదేమని అందరూ ఆ వృక్షం వద్దకు చేరుకుంటారు... ఎవ్వరికీ ఏమీ అర్ధం కాదు... చివరికి యువరాజుకు కూడా...
అక్కడే ఉన్న నారదుడు భళా మానవా భళా... నీవు చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుక్కున్న తుమ్మెదలు నీ ఆపదను కనిపెడుతూనే ఉన్నాయి... ఈ పరీక్ష వాటికి తెలువగానే అవి ఆ మహా వృక్షాన్ని మొత్తం లోనికెళ్ళి వలిచిపెట్టాయు... నీవు అడగకున్నా వాటి ధర్మం అవి చేసాయి. నీకు తెలిసో తెలియకో నీవు అడగకున్నా మూగ ప్రాణాలకు చేసిన ప్రాణబిక్షే నిన్ను ఈనాడు కాపాడాయు. అంతే కాదు. అవి నీకు ఏవిధంగా సహాయపడగలవు అని నీ మనసులో కూడా నీవు అనుకున్నావు... చూసావు కదా ఎప్పుడు ఏ ప్రాణి ఏవిధంగా సహాయం పడుతుందో తెలిసిందికదా... అని చెబుతాడు.
అందుకు ఆ యువరాజు ఆ తుమ్మెదలకు మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంటూ... నారదునికి నమస్కరిస్తాడు...
మానవా మేము పెట్టిన అన్ని పరీక్షలలో నీవు నెగ్గావు... ఇక దేవేంద్రుడి నిర్ణయమే తదుపరి అని నారదుడు చెప్పినా... దేవేంద్రుని మనసు ఎందుకో అంగీకరించడం లేదు.
ఇంకా ఉంది 18వ బాగం
రచన: గోగులపాటి కృష్ణమోహన్
మానవా.. ఇదుగో ఈ మహావృక్షం కొన్నేళ్ళ సంవత్సరాల క్రితంది.
ఈ మహా వృక్షాన్ని ఒక్కే ఒక్క గొడ్డలి పెట్టుతో కొట్టి కూల్చిచేయాలి అని పరీక్ష తెలియజేస్తాడు నారదుడు. అంతే కాదు నీవు ఇందుకోసం ఎవరిసహాయం కోరరాదు అని చెప్పి సేవకులారా... ఆయుధాలు తీసుకోనిరండి అని చెప్పగానే... దానికి సంబందించిన పలు విధాల గొడ్డల్లను తీసుకొచ్చి మానవుని ముందుంచుతారు... మానవా నీకు నచ్చిన ఆయుధాన్ని తీసుకోని మీరు పరీక్షలో పాల్గొనవచ్చు అని చెప్పగానే.. తాను తనకు నచ్చిన గొడ్డలి తీసుకోని ఆ మహా వృక్షం వద్దకు వెళ్తాడు...
ఏంటి ఈ రెండు పరీక్షలంటే వాటి సహాయం తీసుకున్నాను... ఈసారి ఎవరి సహాయం తీసుకోకుండా చేయమన్నారు... దీనికి బుద్దిబలం సరిపోదు, దేహబలం కూడా సరిపోదు... మరెలా? అని ఆలోచిస్తూ... తన ఇష్ట దైవాన్ని ప్రార్ధిస్తాడు...
ఇక గొడ్డలి తీసుకొని పైకెత్తి.... దైవాన్ని తలుచుకుంటూ... గట్టిగా ఒక దెబ్బ వేస్తాడు.
అంతే అంతటి మహా వృక్షం పెలపెల మంటూ కిందికి విరుచుకు పడుతుంది... అందరూ ఆశ్చర్యానికి లోనవుతారు... అదేమని అందరూ ఆ వృక్షం వద్దకు చేరుకుంటారు... ఎవ్వరికీ ఏమీ అర్ధం కాదు... చివరికి యువరాజుకు కూడా...
అక్కడే ఉన్న నారదుడు భళా మానవా భళా... నీవు చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుక్కున్న తుమ్మెదలు నీ ఆపదను కనిపెడుతూనే ఉన్నాయి... ఈ పరీక్ష వాటికి తెలువగానే అవి ఆ మహా వృక్షాన్ని మొత్తం లోనికెళ్ళి వలిచిపెట్టాయు... నీవు అడగకున్నా వాటి ధర్మం అవి చేసాయి. నీకు తెలిసో తెలియకో నీవు అడగకున్నా మూగ ప్రాణాలకు చేసిన ప్రాణబిక్షే నిన్ను ఈనాడు కాపాడాయు. అంతే కాదు. అవి నీకు ఏవిధంగా సహాయపడగలవు అని నీ మనసులో కూడా నీవు అనుకున్నావు... చూసావు కదా ఎప్పుడు ఏ ప్రాణి ఏవిధంగా సహాయం పడుతుందో తెలిసిందికదా... అని చెబుతాడు.
అందుకు ఆ యువరాజు ఆ తుమ్మెదలకు మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంటూ... నారదునికి నమస్కరిస్తాడు...
మానవా మేము పెట్టిన అన్ని పరీక్షలలో నీవు నెగ్గావు... ఇక దేవేంద్రుడి నిర్ణయమే తదుపరి అని నారదుడు చెప్పినా... దేవేంద్రుని మనసు ఎందుకో అంగీకరించడం లేదు.
ఇంకా ఉంది 18వ బాగం
No comments:
Post a Comment